#ప్రధాని నివాసం ఉంటున్న రోడ్డు పేరును
#లోకకల్యాణ్మార్గ్ అని మార్పించింది మన తెలంగాణ తెలుగు అమ్మాయే....
***************************************************
గీతానాథ్ (20) డెహ్రాడూన్లోని యూనివర్సీటీ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ స్టడీస్లో పబ్లిక్ పాలసీ చదువుతోంది..
ఆమె సొంతూరు నిజామాబాద్ దగ్గరలోని ఆర్మూర్.
తండ్రి శ్రీనాథ్. సినిమా డైరెక్టర్. తల్లి డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రొడ్యూసర్..
గీత చిన్నప్పటినుంచి చాలా చురుకుగా ఉండేది. స్కూల్, కాలేజీల్లో నిర్వహించే ప్రతి ప్రోగ్రామ్లో పాల్గొనేది. చదువులో కూడా ముందుండేది..
అప్పట్లో భారత ప్రధాని నివాసం ఉండే రోడ్కు, గుర్రపు జూదాల రోడ్ (రేస్ కోర్స్) అనే పేరు ఉండేది..
దేశ ప్రధాని ఉంటున్న స్ట్రీట్కి జూదానికి సంబంధించిన పేరు ఉండడం గీతకు నచ్చలేదు..
అదే విషయాన్ని అమె నాన్నకు చెబితే ఆయన
‘ఈ మాట నాకు కాదమ్మా మన ప్రధానికే చెప్పు..’ అన్నారు.
అంతే నా మాట ప్రధాని వింటాడా అని గీత నిరాశపడలేదు. ఇంటర్నెట్లో ప్రధాని కార్యాలయం అడ్రస్ వెతికి, మనసులో మాటలను #లెటర్గా రాసి జూన్ 27, 2016 న ప్రధాని #మోదీకి పంపించింది..
నెల రోజుల తర్వాత దానికి బదులిస్తూ ప్రధాని ఆఫీసు నుంచి ఉత్తరం వచ్చింది..
ఆ తర్వాత కొద్ది రోజులకే, సెప్టెంబర్ 23, 2016న
ప్రధాని నివాసం ఉన్న రోడ్డు పేరును ‘7 రేస్ కోర్స్ రోడ్’ నుంచి ‘7 #లోక్_కళ్యాణ్_మార్గ్’ అని మార్చారు..
బ్రిటిషర్స్ హయాంలో గుర్రపు పందాలకు పెట్టింది పేరుగా ఉన్న ఈ ప్రాంతం, మనదేశం గొప్పతనాన్ని తెలిపేలా లేదన్న కారణంతో పేరు మార్చినట్లుగా న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు..
#inspirational


0 Comments